కేటీఆర్ కు నోటి దూల ఎక్కువైంది-కేటీఆర్ మెంటల్ ఆస్పత్రికి వెళ్లడం ఖాయం: ఎంపీ చామల

పనికిరాని రాజకీయం చేసిర్రు పనికిరాని పాలన చేసిరు..కేటీఆర్ కు నోటి దూల ఎక్కువైంది..

అతి త్వరలో కేటీఆర్ చేసిన స్కాములు బయటకు రాబోతున్నాయి..కేటీఆర్ మెంటల్ ఆస్పత్రికి వెళ్లడం ఖాయం..

మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు.

2014,2018 మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు మీరు చేసింది గుండు సున్నా కేటీఆర్…20% కూడా మీరు చేయలేదు, అధికారం కోల్పోయిన తర్వాత నిద్ర పట్టక ఏది పడితే అది మాట్లాడుతున్నావు. మీరు 10 సంవత్సరాలలో రైతుల కోసం 84 కోట్లు ఖర్చు చేస్తే మేము ఒక్క సంవత్సరంలోనే సుమారుగా 50వేలకు కోట్లకు పైగా రైతుల కోసం ఖర్చు చేశాం. 24 లక్షల మంది రైతులకు 21 వేల కోట్లు రైతుల కోసం రుణమాఫీ చేశాం. మీరు రైతుబంధు కింద రైతులకు మిత్తి మాత్రమే చెల్లించారు. సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని మేము చెప్పినం రోడ్లకు,రియల్ ఎస్టేట్ వెంచర్లకు,గుట్టలకు ఇవ్వము. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయుము మీరు చేసినట్టు.

ఓ పక్క నువ్వు హెచ్ఎండిఏ నిధులు నీ దోస్తుల కోసం ఖర్చు చేశావు. తెలంగాణ ఇచ్చింది యూపీఏ ప్రభుత్వం అనే సోయి కూడా నీకు లేదు కేటీఆర్. మీ కుటుంబం అంతా పోయి సోనియాగాంధీ కాళ్ళు మొక్కిన ఫోటోలు ఇంకా ఉన్నాయి అనేది మర్చిపోకు. నువ్వు యువరాజుగా, మీ నాయన రాజుగా నియంత పోకడ పోయి రాష్ట్రాన్ని అప్పుల అపాలు చేశారు. మాకు ఇంకా నాలుగు సంవత్సరాల సమయం ఉంది నాలుగు సంవత్సరాలలో అన్ని స్కీములు అమలు చేసి చూపిస్తాము. ఒక మంచి ప్రతిపక్ష నాయకులుగా వాస్తవాలు మాట్లాడు. నోటి దూల తో మాట్లాడకు, రైతు రుణమాఫీ,ఉచిత బస్సు, ఉచిత విద్యుత్, 500 కే గ్యాస్ సిలిండర్ ఇవన్నీ నీకు కనిపిస్తలేవా కేటీఆర్. కేటీఆర్ కి మెంటల్ ఎక్కింది, అతి త్వరలో మెంటల్ ఆస్పత్రికి వెళ్లడం ఖాయం అని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్ పై విరుచుకు పడ్డాడు.

Related posts